ఏపీలో 300 దాటిన కరోనా పాజిటివ్ కేసులు... కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం!
- కొత్తగా 37 కేసుల నమోదు
- కర్నూలు జిల్లాలో ప్రబలంగా ఉన్న కరోనా
- జిల్లాలో కొత్తగా 18 కేసులు
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. అటు, కర్నూలు జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. అక్కడ మరో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. నెల్లూరు జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవాళ కొత్తగా 8 పాజిటివ్ కేసులను గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 42 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.