కువైట్ లో భారతీయులపై కరోనా పంజా!
- గత 24 గంటల్లో 77 కొత్త కేసుల నమోదు
- వీరిలో 74 మంది భారతీయులే
- ఇప్పటి వరకు 559 కరోనా కేసుల నమోదు
కువైట్ లో ఇప్పటి వరకు 556 కరోనా కేసులు నమోదయ్యాయి. 456 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 17 మంది ఐసీయూలో ఉన్నారు. 99 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకినవారిలో భారతీయులతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇరాన్ కు చెందిన వారు ఉన్నారు. మరోవైపు గత శనివారం కువైట్ లో తొలి కరోనా మరణం సంభవించింది. మృతుడు భారతీయుడే కావడం గమనార్హం.