మోదీ పిలుపు మేరకు సంఘీభావ శక్తిని చాటిన 130 కోట్ల మంది ప్రజలు

India Lights Lamps To Show Unity In Fight Against Corona virus
  • 9 నిమిషాల పాటు లైట్లను ఆపివేసిన ప్రజలు
  • జ్యోతులను వెలిగించి సంఘీభావం ప్రకటించిన వైనం
  • క్యాండిల్స్ వెలిగించిన చంద్రబాబు, కేసీఆర్, జగన్
కరోనా రక్కసిని కలసికట్టుగా ఎదుర్కొందామన్న ప్రధాని మోదీ... దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఈ రాత్రి 9 గంటలకు 9 తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లో లైట్లను ఆఫ్ చేసి, దీపాలను వెలిగించి సంఘీభావాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు సరిగ్గా 9 గంటలకు ప్రజలంతా లైట్లను ఆపి, బాల్కనీలు, ఇంటి వెలుపలకు వచ్చి దీపాలను వెలిగించారు.

గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని... కరోనాపై యుద్ధంలో తమ స్ఫూర్తిని చాటి చెప్పారు. 130 కోట్ల మంది తమ శక్తిని చాటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అధికారులు, మంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ నివాసాల వద్ద జ్యోతులు వెలిగించారు.
Go Back to Shorts
Narendra Modi
Lamps
Corona Virus

More Telugu News