ఏపీలో 12 గంటల్లో మరో 34 మందికి కరోనా పాజిటివ్

coronavirus cases in ap
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఏపీలో నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 వరకు నమోదైన కొవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలులో 2, చిత్తూరులో 7, కర్నూలులో 23, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు  నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

కొత్తగా నమోదైన 34 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కి పెరిగిందని వివరించింది. ఏపీలో నెల్లూరులో అత్యధికంగా 34 కేసులు, గుంటూరులో 30 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 28 మందికి కరోనాకు చికిత్స పొందుతున్నారు.  

 ఏయే జిల్లాలో ఎంత మందికి కరోనా..?                                               
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh

More Telugu News