మద్యం దొరకక ఆఫ్టర్ షేవ్ లోషన్ తాగి, ఇద్దరి మృతి!
- కరోనా ప్రభావంతో లాక్ డౌన్
- మూతపడిన మద్యం దుకాణాలు
- కూల్ డ్రింకులో కలుపుకుని తాగిన మత్స్యకారులు
తాగడం పూర్తయ్యాక అన్వర్ రాజా తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అక్కడే ఉన్న హసన్, అరుణ్ లు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు చేసుకుంటూ, బాధ భరించలేకపోయారు. స్థానికులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మరోవైపు అన్వర్ పరిస్థితి కూడా శనివారం మధ్యాహ్నానికి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది.