డాక్టర్లు, అత్యాధునిక పరికరాలతో పాకిస్థాన్ కు చేరుకున్న చైనా ప్రత్యేక విమానం!
- పాక్ లో 1500 దాటిన బాధితులు
- వెంటిలేటర్లు ఔషధాలను పంపిన చైనా
- ఇతర ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలింపు
ఈ విమానంలో వెంటిలేటర్లు, మాస్క్ లు, ఔషధాలు తదితరాలు చేరుకోగా, వీటిని వెంటనే ఇస్లామాబాద్, లాహోర్ తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు. కాగా, పాకిస్థాన్ లో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 1500కు పైగా పెరిగాయి. మృతుల సంఖ్య 20 దాటింది. సమీప భవిష్యత్తులో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.