నేటి నుంచి మద్యం షాపులు తెరుస్తున్నారని పుకార్లు ... అసలు నిజమిది!
- వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్
- మందు దొరకక పిచ్చిగా ప్రవర్తిస్తున్న మందుబాబులు
- షాపులు తెరవాలన్న ఉద్దేశం లేదన్న అబ్కారీ శాఖ
- తప్పుడు నోట్ ను వైరల్ చేసిన వారిపై చర్యలు
ఈ మేరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ పేరిట ఒక నకిలీ నోట్ కూడా సర్క్యూలేట్ కాగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ షాపులు తెరవాలని, కానిస్టేబుళ్లను కాపలాగా పెట్టి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, విక్రయాలు సాగించాలని ఈ నోట్ లో ఉంది. షాపుల యజమానులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది కూడా.
కాగా, ఈ నోట్ ను ఆబ్కారీ శాఖ ఖండించింది. అటువంటి ప్రకటన ఏదీ తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఎవరో ఆకతాయిలు పాత నోట్ ను మార్చి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.