విద్యుత్ బిల్లుల చెల్లింపునకు మూడు నెలల వెసులుబాటు?
- కరోనా ఇబ్బందుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
- రాష్ట్రాలను ఆదేశించనున్న కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ
- ఎటువంటి జరిమానాలు లేకుండా మూడు నెలల తర్వాత చెల్లించే అవకాశం
ముఖ్యంగా ఎటువంటి జరిమానా విధించకుండా, విద్యుత్ నిలిపివేత సమస్య లేకుండా మూడు నెలల తర్వాత బిల్లులు చెల్లించే అవకాశం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి గడచిన రెండు రోజుల నుంచి కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. త్వరలోనే అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీలకు కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.