Shooting: సినిమా షూటింగుల నిలిపివేత మార్చి 31 వరకు పొడిగింపు

కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమాల చిత్రీకరణ, ప్రదర్శనల నిలిపివేత మార్చి 31 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజుల కిందట హైదరాబాద్ ఫిలింనగర్ లోని కార్యాలయంలో సమావేశమైన ఫిలిం చాంబర్ పెద్దలు షూటింగులు, చిత్ర ప్రదర్శనలను మార్చి 21 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే, కరోనా అంతకంతకు పెరుగుతుండడంతో తాజాగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం చాంబర్ కార్యవర్గం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరికొన్నిరోజుల్లో మరోసారి సమావేశమై పరిస్థితిపై తాజా సమీక్ష నిర్వహిస్తామని ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.
Shooting
Screening
Telugu Film Chamber
Corona Virus
Tollywood
Andhra Pradesh
Telangana

More Telugu News