జాతీయ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే ఎన్నికలు వాయిదా వేశాం: ఎస్ఈసీ
- కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిందని వెల్లడి
- విపత్తుపై ఆదేశాలు తొలగించిన పిదప ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎస్ఈసీ
- ఎన్నికల కమిషనర్ కు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారంటూ విచారం
ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశామని, రద్దు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని ఎస్ఈసీ ఉద్ఘాటించింది. హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికల కమిషనర్ కు ఉంటాయని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారికి దురుద్దేశాలు ఆపాదించడం తీవ్ర విచారకరం అని పేర్కొంది.