తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసు లేదు: మంత్రి ఈటల
- ఉస్మానియా ఆసుపత్రిలో కూడా ‘కరోనా’ పరీక్షలు
- శాంపిల్స్ ను పూణెకు పంపక్కర్లేదు
- ఇకపై హైదరాబాద్ లోనే టెస్టులు
సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘కరోనా’ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకూ గాంధీ ఆసుపత్రిలో మాత్రమే ‘కరోనా’ను గుర్తించేందుకు వైద్య పరీక్షలు చేసేవాళ్లమని, ఉస్మానియా ఆసుపత్రిలో కూడా అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
‘కరోనా’ నిర్ధారణకు ఇకపై శాంపిల్స్ ను పూణెకు పంపాలని అవసరం లేదని, ఎంతమందికైనా హైదరాబాద్ లోనే టెస్టులు చేస్తామని చెప్పారు. శంషాబాద్ లో ఇప్పటి వరకూ నలభై వేల మంది ప్రయాణికులకు స్కీనింగ్ చేశారని, థర్మల్ స్క్రీనింగ్ మెషీన్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.