కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేతలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు

YS Jagan appreciates national award winners
  • బండి నారాయణస్వామి, పి. సత్యవతిలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
  • తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించారన్న సీఎం జగన్
  • తెలుగువారందరికీ గర్వకారణమని వ్యాఖ్యలు
తెలుగు సాహితీవేత్తలు బండి నారాయణస్వామి, పి.సత్యవతిలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ వారిద్దరినీ అభినందించారు. బండి నారాయణస్వామి, సత్యవతి తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. రాష్ట్రం నుంచి ఇద్దరు రచయితలను ప్రతిష్ఠాత్మక అవార్డు వరించడం తెలుగు వారందరికీ గర్వకారణమని అభివర్ణించారు.
Go Back to Shorts
Jagan
Bandi Narayana Swamy
P.Sathyavathi
Kendra Sahithya Academy Award
Andhra Pradesh

More Telugu News