జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ ను రద్దు చేసిన క్యాట్
- ఆయనను కేంద్ర సర్వీసులకు వెళ్లనివ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
- కేసులేమైనా ఉంటే చట్ట ప్రకారం వ్యవహరించవచ్చని సూచన
- తుది తీర్పు వెలువరించిన ధర్మాసనం
ఏపీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) రద్దు చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతినిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణ కిషోర్ పై ఉన్న కేసును ఏపీ ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని సూచించింది. దీంతో కృష్ణ కిషోర్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.