న్యూజిలాండ్ లో భారత హైకమిషన్ ఇచ్చిన విందులో పాల్గొన్న టీమిండియా క్రికెటర్లు
- ఎల్లుండి నుంచి కివీస్ తో టెస్టు సిరీస్
- భారత క్రికెటర్లను ఆహ్వానించిన హైకమిషన్
- న్యూజిలాండ్ తో తమకు సత్సంబంధాలున్నాయన్న కోహ్లీ
గత కొన్నేళ్లుగా టీమిండియా బలమైన జట్టుగా ఎదిగిందని, దాంతో తమను ఓడించేందుకు అనేక జట్లు ఉవ్విళ్లూరుతుండడం సహజమేనని అన్నాడు. న్యూజిలాండ్ కూడా తమను ఓడించాలని ప్రయత్నిస్తుందని, అయితే, వారి గెలుపు కాంక్షలో ఎలాంటి ప్రతీకార ధోరణి ఉండదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ మ్యాచ్ జరుగుతుండగా, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో హాయిగా మాట్లాడగలిగానంటే కారణం ఇదేనని తెలిపాడు. కాగా, తామిద్దరి మధ్య దొర్లిన మాటలు క్రికెట్ గురించి కాదని, జీవితానికి సంబంధించినవని కోహ్లీ వెల్లడించాడు.