న్యూజిలాండ్‌లో కోహ్లీని విడిచి వస్తూ అనుష్క శర్మ భావోద్వేగభరిత వ్యాఖ్యలు

  • న్యూజిలాండ్‌తో క్రికెట్‌ సిరీస్‌లో ఆడనున్న కోహ్లీ
  • విడిచి భారత్‌కు వస్తోన్న అనుష్క
  • గుడ్‌బై చెప్పి వదిలి రావడం అంత ఈజీ కాదని వ్యాఖ్య
బాలీవుడ్ హీరోయిన్‌ అనుష్క శర్మ తన భర్తను ఉద్దేశిస్తూ భావోద్వేగభరిత పోస్టు చేసింది. ఇటీవల అనుష్కశర్మ, కోహ్లీ కలిసి అక్కడి పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేశారు. అయితే, కోహ్లీని విడిచి అనుష్క భారత్‌కు వస్తోంది. న్యూజిలాండ్‌, టీమిండియా మధ్య త్వరలో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ అక్కడే ఉండనున్నాడు.

భారత్‌లో తనకున్న పనులతో భర్తను విడిచి వస్తుండడంతో అనుష్క ఓ ఫొటో పోస్ట్ చేసి కామెంట్ చేసింది. 'గుడ్ బై చెప్పి ఆ తర్వాత కుదుటపడడం కాలంతో పాటు సులువవుతుందని నువ్వు భావిస్తుండొచ్చు.. కానీ, అది ఎప్పటికీ జరగదు' అని పేర్కొంది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా కోహ్లీ అనుష్క ఈ ఫొటో దిగింది.

Virat Kohli
Anushka Sharma
Bollywood
Crime News

More Telugu News