నిర్భయ దోషులకు కొత్తగా ఉరి తేదీ ఖరారు!

Nirbhaya culprits hanging dates finalised
  • నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ
  • మార్చి 3వ తేదీ  ఉదయం ఆరు గంటలకు నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు
  • ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ ను పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా, ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ ఉరి శిక్ష అమలు కాలేదు.
Go Back to Shorts
Nirbhaya
culprits
Hanging
Tihar jail

More Telugu News