చంద్రబాబుపై వైసీపీ నేత పార్థసారథి విమర్శలు
- అమరావతిని ఒక బంగారు గుడ్డుగా బాబు భావించారు
- అంతేతప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోలేదు
- ఏపీలో ఏదో జరిగి పోయిందంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం తగదు
అంతగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతోందో ప్రజలు గమనించాలని సూచించారు. అమరావతిని ఒక బంగారు గుడ్డుగా, అన్యాయంగా విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ ను ఒక కల్పతరువులా చంద్రబాబు భావించారు తప్పితే బాధ్యతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నాడు ఆయన అనుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియాపైనా ఆయన మండిపడ్డారు. ఏపీలో ఏదో జరిగి పోయిందంటూ సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చడానికి యత్నిస్తోందని అన్నారు.