పోలీసులమంటూ చెప్పి ప్రయాణికురాలిపై అత్యాచారం
- లగేజీలో నిషేధిత ఉత్పత్తులున్నాయనీ బెదిరింపు
- తనిఖీ చేయాలంటూ బస్సు నుంచి దించివేత
- పాడుపడ్డ ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం
లగేజీని పరిశీలిస్తూ.. ఇద్దరు వ్యక్తులు మహిళ కుమారుడిని తమ వద్ద ఉంచుకున్నారు. మరో వ్యక్తి తనతో మాట్లాడాలని చెప్పి ఆమెను పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన జహీరాబాద్ సీఐ సైదేశ్వర్, ఎస్సై వెంకటేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.