మరికాసేపట్లో ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఢిల్లీ ఓటరు ఎటువైపు!

  • 70 సీట్లలో పోటీపడుతున్న 672 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.47 కోట్ల మంది
  • సంక్షేమ పథకాలను నమ్ముకున్న కేజ్రీ.. భావోద్వేగ అంశాలపై బీజేపీ
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఢిల్లీ పీఠాన్ని నిలబెట్టుకోవాలని కేజ్రీవాల్, ఎలాగైనా సొంతం చేసుకోవాలని మోదీ, అమిత్ షాలు గట్టి పట్టుదలగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సంక్షేమ పథకాలే తిరిగి అధికారాన్ని అందిస్తాయని కేజ్రీవాల్ ధీమాగా ఉండగా, భావోద్వేగ అంశాలనే బీజేపీ నమ్ముకుంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా 672 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 1.47 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పోటీపడుతున్నప్పటికీ అది నామమాత్రమే. ఆ పార్టీ పోటీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ కనుక ఓటమి పాలైతే ప్రతిపక్షాలకు మరింత ఊపు లభిస్తుందని, ప్రాంతీయ పార్టీలకు కొత్త ఉత్సాహం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
New Delhi
Elections
Arvind Kejriwal
Narendra Modi
AAP
BJP

More Telugu News