Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ!

  • 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • దర్శనానికి 6 గంటల సమయం
  • నిన్న 70 వేల మందికి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, సర్వ దర్శనానికి 6 గంటల వరకూ సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తుల సంఖ్య అధికంగా ఉన్నందున వారికి దర్శనానికి 3 గంటల వరకూ సమయం పడుతోందని, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. గురువారం నాడు స్వామిని 69,510 మంది భక్తులు దర్శించుకున్నారని, 22,675 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ. 2.76 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News