జగన్ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ఏం చేస్తారో చెప్పిన సీపీఐ నేత రామకృష్ణ!
- జగన్ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ముక్కలుగా నరికేస్తారు
- ఒక గాడిద అమరావతిని శ్మశాసనమంటాడు
- అమరావతి ప్రజలు శాంతికాముకులు
నిజానికి ఈ ప్రాంత ప్రజలు శాంతికాముకులని, 50 రోజులైనా శాంతియుతంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. అదే తమ రాయలసీమలో అయితే ఇప్పటికే ఎక్కడికక్కడ పగలగొట్టేవాళ్లమన్నారు. 151 సీట్లతో గెలిచిన జగన్ సుపరిపాలన అందించాల్సింది పోయి ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తుళ్లూరులో కనిపిస్తే ఇక్కడి మహిళలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారని, అందుకే ఆయన పోలీసులను అడ్డంపెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు.