తిరుమలలో మారిన గదుల బుకింగ్ విధానం... కొత్త నిబంధనలివే!

  • ఎంత గది తీసుకుంటే, అంత మొత్తంలో డిపాజిట్
  • ఖాళీ చేసిన తరువాత రిఫండ్
  • తక్షణం ఆన్ లైన్ భక్తులకు, నెలాఖరు నుంచి ఆఫ్ లైన్ భక్తులకు అమలు
తిరుమలలో అద్దె గదుల బుకింగ్ విధానంలో మార్పులను చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 'క్యాష్ ఆన్ డిపాజిట్' విధానం అమలు చేయనున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ మాధ్యమంలో రూమ్ ను బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుందని పేర్కొంది. గదిని ఖాళీ చేసిన తరువాత ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలియజేసింది.

ఆఫ్ లైన్ లో... అంటే, తిరుమలకు వచ్చి, అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది. కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్ నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానం అమలైంది. ఇప్పుడు తిరిగి పాత విధానంలోకి ఎందుకు మారాల్సి వచ్చిందన్న విషయమై టీటీడీ వివరణ ఇవ్వలేదు.
Go Back to Shorts
Tirumala
Tirupati
ttd
Rooms
Booking
Deposit

More Telugu News