ఆరుగురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేసులు !
- ఎస్సీ, ఎస్టీ లపై తప్పుడు నివేదికలు సమర్పించారని కేసు
- కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశం
- సైఫాబాద్ పీఎస్ లో కేసులు నమోదు
ఎస్సీ, ఎస్టీ కేసులో కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపించారంటూ వత్స అనే మహిళ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు దీనిపై విచారణ జరిపి వీరిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సైఫాబాద్ పోలీసులు వీరిపై ఐపీసీ 201, 203,204,213,193 రెడ్ విత్ యాక్ట్ 34, 120బితో పాటు సీఆర్పీసీ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.