Kite and sweet festival: సికింద్రాబాద్ లో అంతర్జాతీయ పతంగుల పండగ ప్రారంభం

  • పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించిన మంత్రులు
  • పతంగుల పండగతో స్వీట్స్ ఫెస్టివల్ కూడా 
  • 20 దేశాలు, 25 రాష్ట్రాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్
సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ పతంగుల పండగ, స్వీట్స్ ఫెస్టివల్ ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనేందుకు దాదాపు 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి ‘కైట్ ప్లేయర్స్’ వచ్చారు. స్వీట్స్ ఫెస్టివల్ లో దాదాపు వెయ్యికి పైగా దుకాణాలను ఏర్పాటు చేశారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన నోరూరించే స్వీట్స్ ఆయా దుకాణాల్లో ఉన్నాయి.
Kite and sweet festival
secunderabad
Parade Grounds

More Telugu News