ఆ ఆడియోలో ఉన్న గొంతు నాది కాదు: పృథ్వీ
- టీటీడీ ఉద్యోగినితో పృథ్వీ సరస సంభాషణ అంటూ వార్తలు
- స్పందించిన పృథ్వీ
- తప్పుంటే శిక్షించాలని వ్యాఖ్యలు
తనపై కక్షతోనే ఈ చర్యకు పాల్పడ్డారని, ఎవరు చేశారన్నది భగవంతుడికే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని వైసీపీ హైకమాండ్ కు వివరించానని, విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తన తప్పు ఉంటే శిక్షించాలని పృథ్వీ తెలిపారు. ఇక అమరావతి రైతులపై తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడం పట్ల కూడా ఆయన స్పందించారు. తాను బినామీ రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించానని, తన మాటలు ఎవర్నైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు.