వైసీపీ నేతలకు కావాల్సింది రాజధాని కాదు.. విశాఖ సెజ్‌లో వచ్చే లక్షల కోట్లు: సీపీఐ నారాయణ

  • రైతుల నిరసనలో పాల్గొని మాట్లాడిన నారాయణ
  • ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్‌కు లేదు
  • జగన్‌కు మూడు ముక్కలాట ఆలోచన ఎందుకు వచ్చింది
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్‌కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో రైతులు నిర్వహిస్తోన్న నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ నేతలకు కావాల్సింది రాజధాని కాదని, విశాఖ సెజ్‌లో వచ్చే లక్షల కోట్లని ఆరోపించారు.

రాజధానిపై జగన్‌కు మూడు ముక్కలాట ఆలోచన ఎందుకు వచ్చిందని నారాయణ ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడేందుకే వైసీపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని మార్పు వల్ల ఎన్నో నష్టాలు వస్తాయని ఆయన తెలిపారు.
Go Back to Shorts
CPI Narayana
Amaravati
Andhra Pradesh

More Telugu News