వెంకన్న భక్తులపై చలి పులి దెబ్బ!
- తిరుమలలో సాధారణ రద్దీ
- దర్శనానికి 5 గంటల సమయం
- రేపు కోయల్ ఆళ్వార్ తిరుమంజనం
సోమవారం ఉదయం 7 కంపార్టుమెంట్లలో మాత్రమే స్వామివారి సర్వదర్శనం నిమిత్తం భక్తులు ఎదురు చూస్తున్నారు. వీరికి దర్శనానికి 5 గంటల వరకూ సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక, దివ్య దర్శనం భక్తుల దర్శనానికి 2 గంటల సమయం పడుతోందన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా రేపు ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.