ఇంగ్లీష్ మీడియంలో బోధన 1 నుంచి 6వ తరగతి వరకే: సీఎం జగన్
- పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం కట్టుబడివుంది
- నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఆంగ్ల భాషా ప్రయోగ శాలల ఏర్పాటు
- పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాల అమలుకు నిర్ణయం
ఈనెల14 నుంచి ప్రారంభం కానున్న నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాల్సిందిగా సూచించారు. 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు పాఠశాలల్లో తగు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు చెప్పారు.