అద్వానీ జన్మదినం.. ఇంటికొచ్చి శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య నాయుడు, మోదీ, అమిత్ షా!

  • 92వ వసంతంలోకి అడుగుపెట్టిన అద్వానీ
  • శుభాకాంక్షల వెల్లువ
  • అద్వానీజీ ఓ రాజనీతిజ్ఞుడు: మోదీ
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఈ రోజు 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఉదయం అద్వానీ నివాసానికి  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కాసేపు మాట్లాడారు.
  అద్వానీ ఓ రాజనీతిజ్ఞుడు, దేశ దార్శనికుడు అని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలు సాధికారత సాధించడంలో ఆయన అందించిన సహకారం అసాధారణమని తెలిపారు. అద్వానీకి బీజేపీ పార్టీ సీనియర్లతో పాటు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
 
Go Back to Shorts
Narendra Modi
advani
Amit Shah
JP Nadda
Venkaiah Naidu

More Telugu News