ప్రాక్టీసులో గాయపడిన రోహిత్ శర్మ!
- ఎడమతొడకు బంతి తగలడంతో ప్రాక్టీస్ నిలిపివేత
- ఆదివారం భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టీ-20
- వికెట్ కీపింగ్ బాధ్యతలు రిషభ్ పంత్ కే..?
రోహిత్ గాయంపై జట్టు మేనేజ్ మెంట్ ఒక ప్రకటన చేస్తూ ‘రోహిత్ చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే తెలియజేస్తాము’ అని చెప్పింది. గాయం పెద్దది కాదని జట్టు వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. ఇక బంగ్లాతో ఆడే తొలి టీ-20 మ్యాచ్ లో వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ బరిలోకి దిగుతాడని భావిస్తున్నారు. సంజు శాంసన్ మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా, పంత్ వికెట్ల వెనక గ్లోవ్స్ తో కీపింగ్ చేశాడు. బంగ్లా పేస్ బౌలర్లను ఎదుర్కోవడానికి ప్రాక్టీసులో బంతులు వేగంగా విసిరే శ్రీలంక స్పెషలిస్ట్ త్రోవర్ నువాన్ ను జట్టు మేనేజ్ మెంట్ రప్పించింది. భారత్-బంగ్లా తొలి టీ 20 ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.