గోదావరి నుంచి బోటును బయటికి తీసిన డైవర్లను సన్మానించిన మంత్రి అవంతి
- గోదావరిలో బోటు ప్రమాదం
- బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం
- డైవర్ల నైపుణ్యాన్ని, తెగువను ప్రశంసించిన మంత్రి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో విశాఖ, భీమిలి, అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈ ఉత్సవాలకు రూ.2 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. నవంబరు 9, 10 తేదీల్లో భీమిలి ఉత్సవ్, డిసెంబరు 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని వివరించారు. ఆపై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.