అమెరికాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం: నిర్మలా సీతారామన్ ఆశాభావం
- ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీతారామన్
- కొన్ని అంశాల్లో ఉన్న విభేదాలు తొలగిపోతాయి
- అమెరికాతో వాణిజ్య శాఖ చర్చలు జరుపుతోంది
కాగా, బాదం, యాపిల్స్ సహా 28 అమెరికా ఉత్పత్తులపై కొన్ని నెలల క్రితం భారత్ సుంకాలు పెంచింది. ఈ నేపథ్యంలో భారత్ కు వాణిజ్య రంగంలో ఇస్తున్న ప్రత్యేక పన్ను రాయితీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జూన్ లో రద్దు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై స్వల్ప విభేదాలు నెలకొన్నాయి. అమెరికా 'సాధారణీకరించిన ప్రాధాన్యతల విధానం' ద్వారా అభివృద్ధి చెందుతోన్న దేశాలకు ప్రత్యేక పన్ను రాయితీ ఇస్తోంది. ఈ జాబితాలో భారత్ ఉండేది.