మాజీ మంత్రి మాదాటి నర్సింహారెడ్డి కన్నుమూత!

  • ఉమ్మడి ఏపీలో మంత్రిగా సేవలు
  • గత కొంతకాలంగా అనారోగ్యం
  • సంతాపం తెలిపిన కేసీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాదాటి నర్సింహారెడ్డి ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాదాటి కన్నుమూసినట్టు కుటుంబీకులు వెల్లడించారు.

భూపాలపల్లి జిల్లా మొసలపల్లిలో జన్మించిన నర్సింహారెడ్డి, తెలుగుదేశం పార్టీలో పలు పదవులను చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.
Go Back to Shorts
Madati Narsimha Reddy
KCR
Passes Away

More Telugu News