పుత్తూరులో డ్వాక్రా మహిళలకు మొదటి విడత రుణాలు పంపిణీ చేసిన రోజా

  • పుత్తూరులో రోజా పర్యటన
  • మెప్మా ఆధ్వర్యంలో రుణాల పంపిణీ కార్యక్రమం
  • 96 డ్వాక్రా సంఘాలకు లబ్ది
వైసీపీ నేత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా పుత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు మొదటి విడతగా రూ.5.19 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలకు రూ.11.54 కోట్ల మేర బ్యాంకు రుణాలు అందించేందుకు ప్రతిపాదనలు పంపగా, అందులో భాగంగా ఇవాళ రోజా చేతులమీదుగా తొలి విడత రుణాలు పంపిణీ చేశారు. 96 డ్వాక్రా గ్రూపులకు ఈ రుణాలు అందించనున్నారు.
Go Back to Shorts
Roja
APIIC
YSRCP
Andhra Pradesh

More Telugu News