‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తాం!: ఆదిమూలపు సురేష్
- 4 రోజుల్లో టీటీడీ పాలక మండలి కొలువుదీరుతుంది
- వైవీ సుబ్బారెడ్డి దళారీ వ్యవస్థను అరికట్టారు
- ‘అమ్మఒడి’ని జనవరి నుంచి ప్రారంభిస్తాం
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మఒడి’ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తామని ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.