తనకు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చాలన్న అమిత్ షా!
- ఎన్ఎస్జీ కమాండోలు వద్దన్న అమిత్ షా!
- మోదీ తర్వాత అమిత్ షాకే ఎక్కువ ముప్పుందంటున్న నిఘా వర్గాలు
- సెక్యూరిటీ అసెస్ మెంట్ కమిటీ ప్రతిపాదన తిరస్కరించిన అమిత్ షా!
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అమిత్ షాకే ఎక్కువ ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో వీఐపీ సెక్యూరిటీ అసెస్ మెంట్ కమిటీ సమావేశమై ఎన్ఎస్జీ కమాండోలతో భద్రత ఏర్పాటు చేసేందుకు అమిత్ షాకు ప్రతిపాదనలు పంపగా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. తనకు ఇప్పుడున్న సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చాలని పేర్కొన్నట్టు సమాచారం.