Andhra Pradesh: చంద్రబాబు డ్రామా వికటించినా.. పల్నాడేతర పచ్చనేతల్ని మేల్కొల్పింది!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాసిల్దార్లు 
  • వారికి ధైర్యం నింపడానికి చంద్రబాబు డ్రామా చేపట్టారు
  • దీనికి అచ్చెన్నాయుడు, కాలవ శ్రీనివాసులు వచ్చారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పల్నాడులో చట్టంతో దోబూచులాడిన తీసేసిన తాసిల్దార్లకు ధైర్యం ఇవ్వడానికి చంద్రబాబు చేపట్టిన డ్రామా వికటించినా, నిదురపోతున్న పల్నాడేతర పచ్చనేతల్ని మేల్కొల్పిందని అన్నారు.

 చలో ఆత్మకూరుకు ప్రత్తిపాటి పుల్లారావు, కోడెల శివప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు రాకపోయినా, బహుదూరాల నుంచి అచ్చెన్నాయుడు, కాలవ శ్రీనివాసులు వచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News