ఏదో చిన్నగా చిట్ చాట్ చేస్తే.. పెద్ద వార్తగా రాశారు: నాయిని
- నాపై వచ్చిన వార్తలపై కేటీఆర్ అడిగారు
- కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడతా
- ఛైర్మన్ పదవి ఇచ్చినా అందులో వారే రసం పోస్తారు
తాజాగా ఈరోజు మీడియాతో మరోసారి చిట్ చాట్ చేస్తూ... తనపై వచ్చిన వార్తలపై కేటీఆర్ అడిగారని నాయిని చెప్పారు. మీడియాతో ఏదో చిన్నగా చిట్ చాట్ చేస్తే... పెద్ద వార్తగా రాశారని అన్నారు. తనను సీఎం కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడతానని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తమదేనని... అందులో ఉన్న పదవులు కూడా తమకే వస్తాయని తెలిపారు. ఆర్టీసీ ఛైర్మన్ పదవిలో రసం లేదని ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఛైర్మన్ పదవి ఇచ్చినా అందులో వారే రసం పోస్తారని చెప్పారు.