Chandrababu: గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్షించడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా?: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
వంద రోజుల జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్షించడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పునఃసమీక్షల కారణంగా రూ.9 వేల కోట్ల విలువైన పనులు నిలిచిపోయాయి అని ఓ సీఈఓ పేర్కొన్నది నిజం కాదా అని నిలదీశారు. ఇది వైసీపీ ప్రభుత్వ తీవ్రవాదం అని పారిశ్రామికవేత్తలు పేర్కొనడం వినబడలేదా? అంటూ వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. అంతేకాకుండా, '100 డేస్ తుగ్లక్ జగన్' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News