ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్ ను నేలకు దింపిన కంగారూలు!
- యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ కు ఘోర పరాభవం
- 251 పరుగులతో ఆసీస్ ఘనవిజయం
- 5 టెస్టుల సిరీస్ లో 1-0 తో ముందంజ
ఇంగ్లాండ్ జట్టులో క్రిస్ వోక్స్ (38) టాప్ స్కోరర్. ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 374 పరుగులతో బదులిచ్చింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్ 487/7 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఏ దశలోనూ పోరాడుతున్నట్టు కనిపించలేదు. లయన్, కమిన్స్ ధాటికి బ్యాట్లెత్తేశారు.
కాగా, ఆసీస్ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే స్టీవెన్ స్మిత్ ఆటేనని చెప్పాలి. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలు సాధించి ఆసీస్ ను గెలుపుబాటలో నిలిపాడు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ లో కంగారూలు 1-0తో ఆధిక్యంలో నిలిచారు.