Salman Khan: సల్మాన్ ఖాన్ తో ఒప్పందం కుదుర్చుకున్న 'భారత్ పే'

  • భారత్ పే బ్రాండ్ అంబాసడర్ గా సల్మాన్ ఖాన్
  • ఈ ఏడాది చివరి నాటికి రూ. 35 వేల పెట్టుబడులు పెట్టనున్న ఫిన్ టెక్
  • డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే సంస్థ లక్ష్యం
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఫిన్ టెక్ సంస్థ భారత్ పే ఒప్పందం కుదుర్చుకుంది. తమ సంస్థ ఉత్పత్తులకు సల్మాన్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించబోతున్నారని సంస్థ సీఈఓ అస్నీర్ గ్రోవర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రోవర్ మాట్లాడుతూ, చిల్లర విక్రేతల కోసం పలు రకాల పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రూ. 35 వేల కోట్ల పెట్టుబడులను పెట్టబోతున్నట్టు తెలిపారు. డిజిటల్ చెల్లింపులు, స్వీకరణలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
Salman Khan
Bharat Pay
Brand Ambassador
Bollywood

More Telugu News