పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం చదువు: సీఎం జగన్
- పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లు ఆమోదం
- పేదలకు చదువును దగ్గర చేసేందుకే ఈ కమిషన్
- చదువుకోవడం పిల్లల హక్కు
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చే దిశగా పేద, మధ్య తరగతి ప్రజలకు చదువును ఒక హక్కుగా ఇవ్వాలని అన్నారు. దేశంలో నిరక్షరాస్యత 26 శాతం ఉంటే, ఏపీలో 33 శాతం ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. ఈ కమిషన్ చెప్పిన మాట వినని పాఠశాలలను హెచ్చరిస్తుందని, ఆపై పెనాల్టీ విధిస్తుందని, అయినా మాట వినని పాఠశాలలను మూసివేసే అధికారాలు ఈ కమిషన్ కు ఉంటాయని వివరించారు.