సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూత!
- సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు తండ్రి
- ఆకాశవాణిలో పలు రకాల సేవలు
- సినీ గేయ రచయితగానూ గుర్తింపు
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో మే 29 ,1944న జన్మించిన ఆయన, తొలుత 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ఆపై ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు. ఎన్నో లలిత గేయాలు, కవితలు, సాహిత్య వ్యాసాలను అందించారు. రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలను రచించి పేరు తెచ్చుకున్నారు. కృష్ణావతారం, నెలవంక, రావు- గోపాలరావు తదితర సినిమాలకు పాటలు రాశారు. ఇటీవల 'సమ్మోహనం' చిత్రంలో 'మనసైనదేదో...' అనే గీతాన్ని రాశారు. శ్రీకాంత శర్మ మృతి సాహిత్య లోకానికి తీరని లోటంటూ పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు.