విమానంలో పది నిమిషాల ఇంధనం మాత్రమే... గట్టెక్కిన 153 మంది ప్రాణాలు!
- అత్యవసరంగా లక్నోలో దిగిన విస్తార ఎ-320 విమానం
- ముంబయి నుంచి ఢిల్లీ వెళ్తోన్న విమానం
- 153 మంది ప్రయాణికులు సురక్షితం
- లక్నోలో ఇంధనం నింపుకున్నాక రాజధానికి పయనం
విమానం లక్నో పరిసరాల్లోకి చేరుకునే సరికే అందులో సుమారు 300 కేజీల ఇంధనం మాత్రమే మిగిలింది. వాస్తవానికి ఇంధనం అధికంగానే నింపుకుని వెళ్లినప్పటికీ, ఢిల్లీ వెళ్లడం.. అక్కడ చాలాసేపు చక్కర్లు కొట్టడం వల్ల ఇంధనం అయిపోవచ్చింది. దీంతో పైలట్లు ‘ఫ్యూయల్ మేడే’ ప్రకటించారు. ప్రయాణికుల భద్రతకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన పైలట్లు చివరకు సురక్షితంగా విమానాన్ని లక్నో విమానాశ్రయంలో దించారు. అయితే విమానయాన అధికారులు ఢిల్లీలో ఈ విమానం దిగేందుకు వాతావరణం సరిగ్గా లేనందున లక్నోకు మళ్లించినట్లు తెలిపారు. విశేషం ఏమిటంటే, లక్నో చేరేటప్పటికి ఇక పది నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే విమానంలో వుంది!