పంజాబ్ మంత్రి పదవికి మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా!

  • రాహుల్ గాంధీకి రాజీనామా పంపిన సిద్ధూ
  • ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో విభేదాలే కారణం
  • రాజీనామాపై వివరణ ఇవ్వని సిద్ధూ
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. రాజీనామా లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సిద్ధూ.. ఈ లేఖను జూన్ 10నే రాహుల్ గాంధీకి పంపానని స్పష్టం చేశారు. అయితే ఈ రాజీనామాను ఎందుకు సమర్పించారన్న విషయమై సిద్ధూ స్పష్టత ఇవ్వలేదు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 52 లోక్ సభ స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ లోని 13 లోక్ సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించింది. మరోవైపు శిరోమణి అకాళీదళ్(4), ఆప్ పార్టీ ఓ చోట విజయం సాధించాయి.

అయితే పట్టణ ప్రాంతాల్లో సిద్ధూ సరిగ్గా ప్రచారం నిర్వహించకపోవడం వల్లే మిగిలిన సీట్లను కోల్పోయామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అప్పట్లో విమర్శలు గుప్పించారు. దీంతో సిద్ధూ, అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటినుంచి ఇద్దరి మధ్య దూరం పెరగడంతో అమరీందర్ సింగ్ కేబినెట్ నుంచి సిద్ధూ తప్పుకున్నట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
Go Back to Shorts
punjab
siddu
resign
minister
Congress
Rahul Gandhi

More Telugu News