'ప్రజావేదిక' కూల్చివేత పనులు 80 శాతం పూర్తి

  • నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన కూల్చివేత పనులు
  • వర్షం కారణంగా పనులకు స్వల్ప అంతరాయం
  • కరకట్ట ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
ప్రజావేదికను కూల్చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో... కూల్చివేత కార్యక్రమం రాత్రంతా కొనసాగింది. ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా భవనాన్ని నేలమట్టం చేశారు. ఈ ఉదయం వర్షం కురవడంతో, కూల్చివేత పనులకు స్వల్ప ఆటంకం కలిగింది. అనంతరం, కూల్చివేతను మళ్లీ కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఈ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించాలని తొలుత అనుకున్నప్పటికీ... ఊహించని విధంగా నిన్న రాత్రి నుంచే పనులు మొదలు పెట్టారు. మరోవైపు, ప్రజావేదికతో పాటు కరకట్ట ప్రాంతాన్ని మొత్తం భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు.
Go Back to Shorts
prajavedika
demolition
amaravathi

More Telugu News