టీడీపీ నుంచి త్వరలో మరికొన్ని వలసలు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
- పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా వైపు చూస్తున్నారు
- ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు లేదు
- నారావారి పార్టీ పట్ల నాయకుల్లో అసంతృప్తి ఉంది
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదని, ఇప్పుడు నారావారి తెలుగుదేశం పార్టీయే మిగిలిందని ఘాటుగా విమర్శించారు. అధినాయకుని నిర్ణయాలు పార్టీలోనే చాలామందికి నచ్చడం లేదన్నారు. కాంగ్రెస్తో జత కట్టడాన్ని పార్టీ సీనియర్ నాయకుడు కె.ఈ.కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు వంటి వాళ్లకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా, పార్టీ నిర్ణయం కాబట్టి నోరు మెదపలేకపోయారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే పేరు లేకపోయినా ఆ విధంగా రావాల్సిన ప్రయోజనాలన్నీ అందితీరుతాయని మాధవ్ చెప్పారు.