తెలంగాణకు రుతుపవనాల రాక ఆలస్యమే.. అడ్డుకుంటున్న ‘వాయు’ తుపాను!
- అరేబియా సముద్రంలో ‘వాయు’ తుపాను
- రుతుపవనాల్లోని తేమను లాగేసుకుంటున్న తుపాను గాలులు
- నేడు, రేపు తెలంగాణలో మండిపోనున్న ఎండలు
వాయు తుపానులోని గాలులు నైరుతి రుతుపవనాల్లోని తేమను లాగేసుకుంటున్నాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు విస్తరించి వర్షాలు పడడం ఆగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజానికి సాధారణ పరిస్థితుల్లో ఈ నెల 15 నాటికి తెలంగాణ, మహారాష్ట్రలను దాటి గుజరాత్ వరకు విస్తరించాలని అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఫలితంగా కేరళ నుంచి తెలంగాణకు రుతుపవనాల రాక మరో వారం ఆలస్యమయ్యేలా ఉందని వివరించారు. ఇక, నేడు రేపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని, ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని హెచ్చరించారు.