ప్రేమిస్తున్నానని అమ్మాయి చెబితే నమ్మి నట్టేట మునిగిన హైదరాబాదీ!
- బీహెచ్ఈఎల్ లో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగి
- విదేశీ యువతిగా ఏంజెలా పరిచయం
- పెళ్లి చేసుకుంటానని చెబితే నమ్మిన బాధితుడు
ఆపై ఈ నెల 18న రోహిత్ అనే వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది. ముంబై ఎయిర్ పోర్టుకు ఏంజెలా డొనాల్డ్ నుంచి ఓ పార్శిల్ వచ్చిందని, దాన్ని పంపాలంటే, బీమా కింద రూ. 65,800 కట్టాలని చెప్పడంతో, అతను చెప్పిన ఖాతాలో డబ్బులేశాడు. మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి, కస్టమ్స్ క్లియరెన్స్ ఇంకా పూర్తి కాలేదని, మరో రూ. 2.35 లక్షలు కట్టాలంటే ఆ పని కూడా చేశాడు. ఆపై 21వ తేదీన ఆర్బీఐ పేరుతో ఓ ఈ మెయిల్ వచ్చింది. ఈమెయిల్ లింక్ ను క్లిక్ చేసి ఆన్ లైన్ ఖాతాను తెరిస్తే, అందులో డబ్బులేస్తామని అందులో ఉండటంతో బాధితుడు ఆన్ లైన్ ఖాతాను తెరిచాడు. ఆపై రోజులు గడుస్తున్నా డబ్బు జమ కాకపోవడం, ఫోన్ నంబర్లు పనిచేయక పోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 417, 219, 420లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.