సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై నటి స్వర భాస్కర్ సంచలన వ్యాఖ్యలు

  • దేశానికి మంచి రోజులు వచ్చాయి
  • ఉగ్రవాద ఆరోపణలున్న వ్యక్తిని పార్లమెంటుకు పంపుతున్నాం
  • ఇప్పుడిక పాకిస్థాన్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్
వివాదాస్పద బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై బాలీవుడ్ నటి స్వరభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వి.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఆమె గెలుపుపై నటి స్వరభాస్కర్ స్పందించారు.

దేశానికి మంచి రోజులు వచ్చాయని వ్యంగ్యంగా ట్వీట్ చేసిన స్వరభాస్కర్.. దేశంలో తొలిసారి ఉగ్రవాద ఆరోపణలు కలిగిన వ్యక్తిని పార్లమెంటుకు పంపుతున్నామని, ఇప్పుడిక పాకిస్థాన్ గురించి ఏమని మాట్లాడుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, భోపాల్‌లో దిగ్విజయ్‌ సింగ్‌కు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషిల తరపున ఈ ఎన్నికల్లో స్వరభాస్కర్ ప్రచారం చేశారు. కానీ, వారందరూ పరాజయం పాలయ్యారు.
Go Back to Shorts
Sadhvi pragya
Actress swara Bhaskar
Bollywood
Bhopal

More Telugu News